సింగరకొండలో మృతదేహం కలకలం.. వ్యక్తి గుర్తింపుపై అన్వేషణ
పల్నాడు: అద్దంకి మండలం సింగరకొండ వద్ద ఓ వ్యక్తి మృతదేహం బయటపడటం ఆందోళన కలిగించింది. మినీ స్టేడియం సమీపంలోని రోడ్డుపై ఆదివారం ఉదయం శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.