విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే..?

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో బుధవారం భక్తులు స్వామి వారికి చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,54,795 ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 155 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 19 మంది లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు, 1700 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.