పిల్లల విక్రయం కేసులో జనసేన నేత అరెస్ట్
ఏలూరు: పసి పిల్లల కిడ్నాప్, విక్రయం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న జనసేన ఏఎన్ బాబును అరెస్ట్ చేశారు. అతడితో పాటు తల్లి అబ్బిశెట్టి వీరమ్మ, గ్యాంగ్ లోని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ గ్యాంగ్ ఐదుగురు పిల్లలను విక్రయించినట్లు గుర్తించారు. వీరికి బెజవాడ ముఠా సభ్యురాలు ఫరీనాతో లింకులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.