ఆయన సేవలు చిరస్మరణీయం: జగన్

AP: మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఎన్నో త్రాగు, సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి, దేశం గర్వించదగ్గ ఇంజనీరింగ్ నిపుణులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం' అని పేర్కొన్నారు.