VIDEO: సిద్దిపేట ప్రజావాణికి 165 దరఖాస్తులు
SDPT: ప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తులను యుద్ధప్రతిపాదికన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ కలిసి ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా వివిధ సమస్యలపై మొత్తం 165 దరఖాస్తులు అందాయి. ప్రజలు నమ్మకంతో దరఖాస్తులు ఇస్తున్నారని, వాటిని సమీక్షించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలి.