భారీగా డ్రగ్స్ స్వాధీనం

ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా మాదకద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు. రూ.23.5 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ, అసోం రైఫిల్స్ జాయింట్ ఆపరేషన్ను నిర్వహించారు. జనవరి నుంచి ఇప్పటివరకు రూ.173 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు.. డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు తీసుకువచ్చారన్న దానిపై విచారణ చేస్తున్నారు.