రామ్మూర్తి కుటుంబానికి ఎర్రబెల్లి పరామర్శ
MHBD: పెద్దవంగర మండలంలోని గంట్లకుంట గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు గుర్రం రామ్మూర్తి పెద్ద కుమారుడు గుర్రం సంతోష్ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అన్ని విధులుగా పార్టీ ఆండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.