నిరాశ్రయుల వసతి గృహాలను పరిశీలించిన కమిషనర్
NTR: విజయవాడలో డివైడర్లు, ఫుట్పాత్లు, వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశించారు. గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన నిరాశ్రయుల వసతి గృహాలు, మరుగుదొడ్లు, డ్రైనేజీ పంపింగ్ స్టేషన్లు పరిశీలించారు. అలాగే అయోధ్య నగర్లోని అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసి ఆహారం పరిశీలించారు.