నేటి నుంచి రామయ్య క్షేత్రంలో ఆర్జిత సేవలు
KDP: ఒంటిమిట్ట కోదండ రామాయలంలో ఆర్జిత సేవలను నేటి నుంచి మళ్లీ పునరుద్ధరణ చేస్తున్నట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ ఆదివారం తెలిపారు. అర్చన చేయించాలంటే భక్తులు రుసుం రూ.10 చెల్లించాలని వివరించారు. అంతరాలయం ప్రవేశం (ఇద్దరికీ) రూ.50,ప్రతినెలా మాస పౌర్ణమికి జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొనాలంటే రూ.వెయ్యి చెల్లిస్తే ఇద్దరికీ అనుమతిస్తామని వివరించారు.