నారాయణి అలంకారంలో విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు ప్రైవేట్ బస్టాండ్ సమీపంలో వెలిసిన విరుపాక్షి మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని అర్చకులు నామాలతో ప్రత్యేకంగా నారాయణి అలంకారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాహుకాల పూజకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ వారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.