విద్యుత్ వైర్ అడ్డు తొలగిస్తూ.. రైతు మృతి
SRPT: వరి కోత మిషన్కు అడ్డుగా ఉన్న విద్యుత్ వైరును తొలగించే క్రమంలో షాక్కు గురై నేరేడుచర్ల మండలం దర్శంచర్లకు చెందిన రైతు చెన్నబోయిన గోపయ్య(37) మంగళవారం మృతి చెందారు. సర్వీస్ వైర్కు రబ్బర్ కోటింగ్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుమునుకున్నాయి.