నేడు సీపీ కార్యాలయంలో పీజీఆర్ఎస్

నేడు సీపీ కార్యాలయంలో పీజీఆర్ఎస్

VSP: విశాఖ సీపీ కార్యాలయంలో నేడు ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను తెలుపవచ్చని కమిషనర్ పేర్కొన్నారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలు, పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగకపోవడం వంటి సమస్యలపై ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు.