5.40 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

SRD: కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులో ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో 5.40 కిలోల ఎండు గంజాయి శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కారులో గంజాయిని తరలిస్తుండగా ఆంధ్రప్రదేశ్కు చెందిన చిరంజీవిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ శంకర్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై హనుమంతు, అనుదీప్, సతీష్ పాల్గొన్నారు.