తిరుమల అన్న ప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం

తిరుమల అన్న ప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం

TPT: విజయవాడకు చెందిన భక్తుడు చక్కా మోనిష్ వెంకట సత్యప్రకాష్ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ. కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుపతిలోని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు భవనం వద్ద విరాళం డీడీని అందజేశారు. అనంతరం విరాళం అందజేసిన దాతను, కుటుంబ సభ్యులను ఛైర్మన్ అభినందించారు.