ఘనంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు

KMM: మధిర పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో బుధవారం అమ్మవారి జయంతి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాసుల శేషాచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.