శాంతినగర్ ఆలయం భక్తులకు తెరవడం
GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్లో ఉన్న శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని గ్రహణం సందర్భంగా మూసివేసి, సంప్రోక్షణ అనంతరం నేడు భక్తులకు తిరిగి తెరిచారు. అర్చకులు వినయ్ కౌశల్ శర్మ పూజాదికాలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రహణం ముగిసిన సందర్భంగా భక్తులు గోమాతను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.