ఏపీఈపీడీసీఎల్ క్రీడాపోటీల ప్రారంభం
VSP: ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగుల క్రీడాపోటీలను సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ మంగళవారం ప్రారంభించారు. విశాఖ రైల్వే గ్రౌండ్లో జరుగుతున్న రెండు రోజుల ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ మీట్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. పురుషులు, మహిళల విభాగాల్లో పలు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు.