గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ మృతి

గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ మృతి

SDPT: బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నల్లగొండ లక్ష్మి బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. లక్ష్మికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రజలతో ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉండే ఆమె మరణం పట్ల గ్రామస్థులు, పలువురు ప్రజాప్రతినిధులు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.