VIDEO: టీచర్లే దాడికి పాల్పడితే ఎలా?: విలేకరులు
సత్యసాయి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే దాడికి పాల్పడితే విద్యార్థులకు ఏమి పాఠాలు నేర్పిస్తారని ఏపీజేఎఫ్ నాయకులు జర్నలిస్టులు మండిపడ్డారు. సోమవారం ఏపీజేఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు చరణ్ కుమార్ మాట్లాడుతూ... పరిగి మండలం నరసాపురంలో విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన విషయాన్ని ఫోటోలు తీసిన విలేకరిపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.