కోడవటంచ ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర
BHPL: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాల సమగ్రాభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో భూపాలపల్లి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.