పసివేదలలో వైభవంగా గోగులమ్మ తల్లి జాతర

పసివేదలలో వైభవంగా గోగులమ్మ తల్లి జాతర

తూ.గో: కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో వెలసి ఉన్న గ్రామదేవత గోగులమ్మ తల్లి జాతర ఉత్సవాలు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో కలిసి పూజలు జరిపారు. సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుతూ జరుపుకుంటున్న ఈ ఉత్సవాలు మన వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు.