విద్యుత్ సరఫరాకు అంతరాయం
NLG: నార్కట్ పల్లిలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా, రహదారికి ఇరువైపులా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వైర్ల మార్పిడి పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉ. 6:00 గంటల నుంచి మ. 12:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. వినియోగదారులు ఈ అంతరాయాన్ని గమనించి, అధికారులకు సహకరించవలసిందిగా విద్యుత్ ఏఈ చంద్రశేఖర్ రావు తెలిపారు.