కార్యకర్తలకు అండగా ఉంటాం: మాజీ ఎమ్మెల్యే

KKD: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటానని పిఠాపురం మాజీ MLA వర్మ భరోసా ఇచ్చారు. టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన బొజ్జ సతీష్ మాజీ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు పిఠాపురం అభివృద్ధి, రైతుల సంక్షేమం, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.