హిందూపురంలో డయాగ్నసిస్‌ సెంటర్‌ క్లోజ్‌

హిందూపురంలో డయాగ్నసిస్‌ సెంటర్‌ క్లోజ్‌

సత్యసాయి: హిందూపురంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సత్యం డయాగ్నసిస్‌ సెంటర్‌ను వైద్యాధికారి పద్మజ, ఎంపీహెచ్‌ఈవో మల్లన్న శనివారం పరిశీలించి క్లోజ్‌ చేశారు. సెంటర్‌లో అర్హత లేని వారు రక్తపరీక్షలు చేస్తున్నారని, కాలం చెల్లిన రసాయనాలు వినియోగిస్తున్నారని, గ్లౌజులు వాడకుండా పరీక్షలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. దీంతో సెంటర్‌ను క్లోజ్ చేశారు.