సబ్ జైలును సందర్శించిన సివిల్ జడ్జి

సబ్ జైలును సందర్శించిన సివిల్ జడ్జి

SKLM: సబ్ జైల్లో ముద్దాయిలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని జూనియర్ సివిల్ జడ్జి ఎస్. వాణి అన్నారు. శనివారం నరసన్నపేటలోని సబ్ జైలును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైల్లో ఉన్న ఆరుగురు ముద్దాయిలను మౌలిక వసతులు ఏ మేరకు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతితో పాటు పరిశుభ్రమైన భోజనం తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేశారు.