అడుగంటుతున్న జలాలు... ఎండుతున్న పొలాలు

అడుగంటుతున్న జలాలు... ఎండుతున్న పొలాలు

BHNG: గుండాల మండలంలో రైతులు సాగు చేసిన వరి పొలాలు నీరందక ఎండి పోతున్నాయి. రోజురోజుకూ ముదురుతున్న ఎండలకు బావులు, బోర్లలో నీటి ఊట తగ్గి రైతులు వేసిన వరి పొలాలు ఎండి పోతున్నాయి. బిక్కేరు వాగులలో ఇసుకను యథేచ్ఛగా తోడుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి నీటి ఊట తగ్గి బావులు, బోర్లు ఒట్టి పోతున్నట్లు రైతులు వాపోతున్నారు.