వేసవిలో దొంగల బెడద.. పోలీసులను అలర్ట్ చేసిన డీఎస్పీ

వేసవిలో దొంగల బెడద.. పోలీసులను అలర్ట్ చేసిన డీఎస్పీ

SRPT: పోలీసులు పెన్ పహాడ్ మండలంలోని ప్రజలకు అందుబాటులో ఉండి తమ సేవలను అందించాలని సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి అన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌ను సీఐ రాజశేఖర్‌తో కలిసి సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం వేసవికాలం అయినందున దొంగల బెడద ఉంటుందని కావున సిబ్బంది ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహించాలన్నారు.