'మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి'
VZM: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పించాలని ఎస్పీ దామోదర్ బుధవారం పోలీసు అధికారులను ఆదేశించారు. స్టేషన్లకు వచ్చే మహిళల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, మహిళలు ఆపదలో ఉన్నప్పుడు రక్షణ కల్పించే శక్తి యాప్ పట్ల విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.