బ్రహ్మంగారి మఠాన్ని అభివృద్ధిచేస్తా: ఎమ్మెల్యే

KDP: బ్రహ్మంగారి మఠాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిచి చరిత్రలో నిలిచిపోయేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. శనివారం బ్రహ్మంగారి మఠంలో టూరిజం శాఖ, దేవాదాయశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారి మఠాన్ని అభివృద్ధి చేయాలన్న విషయమై అధికారులతో చర్చించారు.