నేడు భద్రాద్రి కలెక్టరేట్లో ప్రజావాణి

BDK: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. ఫిర్యాదులు, వినతిపత్రాలు సమర్పించేవారు లిఖితపూర్వకంగా అందజేయాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.