ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు
MBNR: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యం అని కాంగ్రెస్ యువ నాయకులు రమేష్ బాబు అన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు న్యూ బాలాజీ నగర్లోని రోడ్ నెంబర్ వన్లో, డీలర్ నరసింహులు చౌరస్తా నుంచి వివిధ కాలనీలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. నూతన రోడ్లను మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.