పెళ్లకూరుకు చేరిన సైకిల్ యాత్ర
TPT: డ్రగ్స్ రహిత ఏపీ లక్ష్యంగా పోలీసులు దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర పెళ్లకూరు మండలానికి చేరుకుంది. వీరిని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ఆదిలక్ష్మి స్వాగతించారు. యువతతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. యువత మాదకద్రవ్యాలు బారిన పడకుండా కాపాడటం అందరి బాధ్యతని ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు.