రైతుల కోసమే భూ భారతి చట్టం: కలెక్టర్

SRD: రైతుల కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కొండాపూర్ మండలం పల్లి గ్రామంలో భూ భారతి అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. జిల్లాలో కొండాపూర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినట్లు చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సదస్సులు జరుగుతాయని పేర్కొన్నారు.