VIDEO: కలుషిత ఆహరం.. విద్యార్థులకు అస్వస్థత
GDWL: జిల్లాలోని గురుకుల ST హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఎస్టీ హాస్టల్లో కలుషిత ఆహారం తినడంతో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.