గుంతలమయమైన రహదారి.. ప్రజల ఆవేదన

గుంతలమయమైన రహదారి.. ప్రజల ఆవేదన

GDWL: అలంపూర్ నుంచి కాశాపురం వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. బీటీ రోడ్డు నిర్వహణ లేకపోవడంతో వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు లేదా నూతన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.