పుంగనూరులో ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
CTR: పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామపంచాయతీలో సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణంలోని కొత్తయిండ్లు, సింగిరిగుంట వద్ద ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు, రాష్ట్ర నాయకుడు రాజారెడ్డి తదితరులు కలిసి జెండాను ఎగురవేశారు. 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్పేయీ నేతృత్వంలో బీజేపీ స్థాపించారని తెలిపారు.