అభివృద్ధి పనులు చేపట్టిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులు చేపట్టిన ఎమ్మెల్యే

NLG: గుండ్లపల్లి(డిండి) మండలం ఎర్రగుంటపల్లి, వావిల్ కోల్ రహమంతాపూర్, కందుకూరు, సింగరాజుపల్లి, తవక్లాపూర్ గ్రామాలలో నూతనంగా నిర్మించనున్న గ్రామ మహిళా సమాఖ్య కార్యాలయ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలునాయక్ శనివారం శంకుస్థాపన చేశారు. కందుకూరు స్కూల్ కాంపౌండ్ వాల్ శంకుస్థాపన చేసిన అనంతరం సీసీ రోడ్డును ప్రారంభించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.