అన్నదాన భవన నిర్మాణానికి రూ.1,63,905 విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మిస్తున్న వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి శుక్రవారం అంబాజీపేట వాస్తవ్యులు శ్రీ నిచ్చెనకొల్ల మునేశ్వరరావు, వెంకటలక్ష్మి దంపతులు రూ.1,63,905 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది దాతలకు స్వామి చిత్ర పటాన్ని అందించారు.