గేదెలపై కుక్కల దాడి
AKP: దేవరాపల్లి మం. కె.ఎం.పాలెంలో పిచ్చికుక్కల దాడులతో రైతులకు నష్టం జరిగింది. గట్రెడ్డి రాము, రెడ్డి గోవింద, సింగంపల్లి సూరికి చెందిన గేదెలపై కుక్కలు దాడి చేసి రెండు పెయ్యలను చంపాయి. పలువురు రైతుల కోళ్లను కూడా హతమార్చడంతో నష్టం పెరిగింది. కుక్కల స్వైర విహారంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. వెంటనే చర్యలు తీసుకుని కుక్కలను నియంత్రించాలని గ్రామస్థులు కోరారు.