పన్నుల వసూళ్లలో వేగం పెంచాలి: కమిషనర్

పన్నుల వసూళ్లలో వేగం పెంచాలి: కమిషనర్

GNTR: పన్నుల వసూళ్లపై రెవెన్యూ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు మరింత శ్రద్ధ చూపాలని గుంటూరు కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. ముఖ్యంగా తాగునీటి కుళాయి, మీటర్ ట్యాప్ ఛార్జీల వసూళ్లపై నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. సోమవారం కొరెటెపాడులో పర్యటించిన ఆయన, అక్కడి చెరువు వాకింగ్ ట్రాక్, పార్కులను సందర్శించి పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు.