‘మహిళలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
VZM: సైబర్ నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు. మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కలక్టరేట్లో బుధవారం పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో మహిళలు సాంకేతికతను వినియోగించుకుంటూనే, ఆన్లైన్ వేదికలపై పొంచి ఉన్న సైబర్ ముప్పు పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.