విజయవంతంగా ముగిసిన చలో జాడు యాత్ర

విజయవంతంగా ముగిసిన చలో జాడు యాత్ర

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల చలో జాడు యాత్ర గురువారం విజయవంతంగా ముగిసింది. ప్రియదర్శిని నగర్, సాగర్ కాలనీల్లో గడపగడపకి వెళ్లి రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, పారిశుద్ధ్య సమస్యలను పార్టీ నేతలు ప్రజల నుంచి తెలుసుకున్నారు. ఈ సమస్యలను త్వరలో అధికారులకు నివేదిస్తామని జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ తెలిపారు.