బిల్డింగ్ పై నుంచి పడి యువకుడు మృతి
HYD: దోమలగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని అశోక్నగర్లో ఉన్న లోటస్ హాస్టల్లో ఇవాళ దారుణం జరిగింది. హాస్టల్లో ఉంటున్న భూపాలపల్లి జిల్లా అంబడిపల్లి గ్రామానికి చెందిన బాసనీ ఆనంద్ (26) పై అంతస్తు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్పృహ కోల్పోయిన ఆనంద్ను హాస్టల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు.