లింగ సమానత్వమే లక్ష్యంగా నూతన చైతన్యం
VZM: లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే నూతన చైతన్యం 4.0 కార్యక్రమాన్ని DRDA కార్యాలయం వద్ద జిల్లా డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి మంగళవారం ప్రారంభించారు. లింగ సమానత్వం సాధించేందుకు మహిళల ఆర్థిక సాధికారత, భద్రత, సమాన అవకాశాలు అత్యంత ముఖ్యమని తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు ఈ ప్రచారం జరుగుతుందన్నారు.