వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

ములుగు: మండలంలోని మహ్మద్ గౌస్ పల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ సేవాసమితి ఆద్వర్యంలో సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళ్యాణ క్రతువును నిమ్మటూరు శ్రీనివాస్ శర్మ జరిపించగా మేకల ప్రశాంత్, కోలా కోటి దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని సుంకరి రాజు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.