జిల్లాలో 440 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ

BPT: జిల్లాలో సోమవారం 35 కేంద్రాలలో యూరియా పంపిణీ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. జిల్లాలోని రైతు సంరక్షణా కేంద్రాలు, పిఏసీఎస్లలో 440 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఇంకా 220 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. 4,983 మంది రైతులకు యూరియా పంపిణీ చేశామని తెలిపారు.