బస్సు దగ్ధం ఘటనపై మంత్రి స్పందన

బస్సు దగ్ధం ఘటనపై మంత్రి స్పందన

KDP: జిల్లాలో బస్సు దగ్ధం ఘటనపై రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ఘటనపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డ్రైవర్ అప్రమత్తత వల్ల ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.