వచ్చే నెల వరకూ ధరఖాస్తు గడువు పెంపు

ASR: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఓపెన్ స్కూల్లో 10, ఇంటర్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 15వరకు ధరఖాస్తు గడువు పొడిగించడం జరిగిందని డీఈవో పీ. బ్రహ్మాజీరావు తెలిపారు. 10లో 14ఏళ్లు, ఇంటర్లో ప్రవేశాలకు 15ఏళ్లు నిండిన వారు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తిగల విద్యార్థులు రూ. 209 లేట్ ఫీజుతో ఈనెల వచ్చే నెల 15లోగా ఆన్లైన్ ధరఖాస్తు చేసుకోవాలన్నారు.