శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే?
TPT: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ప్రస్తుతం 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. గురువారం 59,548 మంది స్వామి వారిని దర్శించుకోగా 25,781 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 4.54 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.