రామ మందిరం నిర్మాణానికి విరాళం అందజేత

రామ మందిరం నిర్మాణానికి విరాళం అందజేత

VZM: మెరకముడిదాం మండలం సిరియాలపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణం కోసం విరాళంగా రూ.10,5000, 2 బియ్యం బస్తాలు వైసీపీ జిల్లా బూత్ కన్వీనర్ అధ్యక్షులు బూర్లె నరేష్ కుమార్ ఆదివారం అందించారు. ఈ నెల 6, 7, 8వ తేదీలో రామాలయం ప్రతిష్ట జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. ఈమేరకు గ్రామ ప్రజలు, యువత హర్షం వ్యక్తపరిచారు.